ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అందుబాటులో ఉన్న రూ.799 రీజార్జ్ ప్లాన్ను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ తాజాగా వివరణ ఇచ్చింది. రూ.799 రీచార్జ్ ప్లాన్ రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీచార్జి చేసుకోవచ్చని స్పష్టత నిచ్చింది. జియో వెబ్సైట్తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ఫ్లాట్ఫామ్లలో ఈ ప్లాన్తో అందుబాటులోనే ఉంచినట్టు వివరణ ఇచ్చింది.
యూజర్లు అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరలో రీచార్జి ప్లాన్లను అందించేందుకు కట్టుబడివున్నట్టు జియో పేర్కొంది. రూ.799 ప్లాన్తో రీచార్జితో రీచార్జి చేసుకుంటే 84 రోజుల కాలపరిమితి పొందవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్లో రోజుకు వంద ఎస్ఎంఎస్లు పొందవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.