Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలతో నిర్మాణ రంగంపై పెనుభారం

cement bags
, మంగళవారం, 17 మే 2022 (10:27 IST)
దేశంలోని నిర్మాణ రంగంపై పెరిగిన ఉక్కు, సిమెంట్ ధరలు భారీ భారాన్ని మోపుతున్నాయి. గరిష్టంగా టన్ను ఉక్కు ధర దాదాపు 75 వేల నుంచి 76 వేల వరకు చేరుకుంది.
 
స్టీల్ ఉత్పత్తులు, టీఎంటీ బార్లు.. నిర్మాణాలు మందగించిన కారణంగా 10, 15 శాతం మధ్య తగ్గాయి. ఈ రేట్లు రానున్న కాలంలో మరింతగా తగ్గుతాయని స్టీల్ రోలింగ్ మిల్స్ అసోసియేషన్ ఛైర్మన్ వివేక్ అదుకియా అన్నారు.
 
ఇన్‌పుట్‌ ఖర్చులు సైతం 50 శాతం పెరగటం, స్పాంజ్ ఐరన్ తయారీకి వినియోగించే అధిక నాణ్యత గల థర్మల్ బొగ్గు టన్నుకు 120 డాలర్ల వరకు పెరగటం అధిక ధరలకు మరో కారణంగా తెలుస్తోంది. 
 
యుద్ధం కారణంగా టన్ను బొగ్గు 300 డాలర్లకు చేరుకుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రానున్న కాలంలో ఉక్కు ధర టన్నుకు 60 వేల వరకు తగ్గుతుందని వారు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ప్రభుత్వాలు నిర్మాణాలను పెంచటం వల్ల ఏర్పడిన డిమాండ్ కూడా ఇందుకు మరో కారణంగా నిలుస్తోంది.
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు తగ్గకపోతే.. 30-40 శాతం సెకండరీ స్టీల్ యూనిట్లు ఉత్పత్తిని తగ్గించాలి లేదా మూసివేయవలసి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఒక్కో అబ్బాయికి నలుగురు అమ్మాయిలతో..