Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలు ప్రయాణికుల కోసం సీట్ల లభ్యత అంచనా ఫీచర్‌‌ను ప్రారంభించిన మేక్‌మైట్రిప్

Advertiesment
train

ఐవీఆర్

, మంగళవారం, 3 జూన్ 2025 (14:26 IST)
భారతదేశంలో రిజర్వుడు రైలు టిక్కెట్లు బయలుదేరేందుకు 60 రోజుల ముందు నుంచి కూడా బుకింగ్ కోసం తెరిచి ఉంటాయి. అయితే, చాలామంది ప్రయాణికులు తమ ప్రణాళికలను ప్రయాణతేదీ చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఖరారు చేసుకుంటారు. మేక్‌మైట్రిప్ డేటా ప్రకారం దాదాపు 40% మంది వినియోగదారులు పలు సెషన్‌లలో, తరచుగా చాలా రోజుల పాటు ఈ ప్రక్రియ సాగే విధంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. ఈ వినియోగదారులలో, దాదాపు 70% మంది వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్లను బుక్ చేసుకుంటారు, ఎందుకంటే వారి ప్లానింగ్స్ స్థిరపడే సమయానికి ధృవీకరించబడిన సీట్లు అందుబాటులో ఉండవు.
 
డిమాండ్ నమూనాలు వారం నుండి వారం వరకు గణనీయంగా మారుతూ ఉండటంతో, కన్ఫర్మ్డ్ బుకింగ్‌ల విండో మారుతూ ఉంటుంది. ఏప్రిల్‌లో, చాలా హై-స్పీడ్ రైళ్ల టికెట్లు బయలుదేరే తేదీకి దాదాపు 13 రోజుల ముందు అమ్ముడయ్యాయి. మే నాటికి, పెరుగుతున్న డిమాండ్ కారణంగా, అవి సాధారణంగా బయలుదేరే తేదీకి 20 రోజుల కంటే ముందు బుక్ చేయబడ్డాయి. దీంతో, ప్రయాణికులకు వారు ఏ రైలు కోరుకుంటున్నారో తెలిసినప్పటికీ, ఎంతకాలం సీట్లు అందుబాటులో ఉంటాయో అనే విషయంలో వారికి తరచుగా నమ్మదగిన అవగాహన ఉండదు, దీని వలన సకాలంలో ప్లాన్ చేసుకోవడం కష్టమవుతుంది.
 
రైలు ప్రయాణికులు మెరుగ్గా ప్లాన్ చేసుకోవడంలో సహాయపడటానికి, మేక్‌మైట్రిప్ సీట్ అవైలబిలిటీ ఫోర్‌ కాస్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఎంచుకున్న రైలులో సీట్లు ఎప్పుడు అమ్ముడుపోయే అవకాశం ఉందో అంచనా వేసే కొత్త ఫీచర్. సంవత్సరాల చారిత్రక బుకింగ్ డేటాను రియల్-టైమ్ డిమాండ్ సిగ్నల్‌లతో కలిపే అధునాతన మోడళ్లను ఉపయోగించి రూపొందించబడిన ఈ ఫీచర్, ప్రయాణికులు ఎక్కువ స్పష్టతతో ప్లాన్ చేసుకోవ డానికి, బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఇప్పుడు మేక్‌మైట్రిప్ యాప్, వెబ్‌సైట్ రెండింటిలోనూ లైవ్‌గా ఉంది, ఇది రైలు బుకింగ్ ఫ్లోలో పొందుపరచబడింది.
 
‘‘భారతీయ రైలు ప్రయాణీకుల అవసరాలను అంచనా వేయడం, పరిష్కరించడం అనే మా లక్ష్యంపై మేం దృష్టి సారించాం. సీట్ల లభ్యత అంచనా అనేది ఆ ప్రయత్నం ఫలితంగా ఉంది. ఇది డేటా సైన్స్‌తో బాగా లోతుగా అనుసంధానమై ఉంది. సజావుగా ఉండేలా నిర్మించబడింది. లక్షలాది మంది వినియోగదారులకు ప్లానింగ్ సవాలును పరిష్కరించడానికి రూపొందించబడింది. ఇది మా రైలు స్టాక్‌కు బలమైన జోడింపుగా ఉంది, ఇది రైలు ప్రయాణాన్ని మరింత ఊహించదగినదిగా, ప్రయాణాన్ని తక్కువ ఒత్తిడితో కూడుకున్నదిగా చేయ డంలో సహాయపడుతుంది’’ అని మేక్‌మైట్రిప్ సహ వ్యవస్థాపకులు, గ్రూప్ సీఈఓ రాజేష్ మాగో అన్నారు.
 
వెంటనే బుక్ చేసుకోవడానికి సిద్ధంగా లేని ప్రయాణికుల కోసం, మేక్‌మైట్రిప్ సోల్డ్-అవుట్ అలర్ట్‌లను కూడా ప్రవేశపెట్టింది. సీటు లభ్యత తగ్గడం ప్రారంభించినప్పుడు సకాలంలో చర్య తీసుకునేలా చేసే ఫీచర్ ఇది. ఇది యాక్టివేట్ అయిన తర్వాత, వారు ఎంచుకున్న రైలులో టిక్కెట్లు ముందుగా పేర్కొన్న పరిమితికి దిగువకు పడిపోయినప్పుడు ఇది వినియోగదారులకు తెలియజేస్తుంది, సీట్లు అయిపోకముందే బుక్ చేసుకోవ డానికి వీలు కల్పిస్తుంది. సీటు లభ్యత సూచనతో జతచేయబడి, ఇది ప్లానింగ్ అనుభవానికి విజిబిలిటీ, నియంత్ర ణను జోడిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం