Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేకిన్ ఇండియా అంటే దేశంలో తయారయ్యే ఫోన్లపై పన్నులా.. హవ్వ..

దేశమంతా వస్తుసేవలపై ఒకే రకం పన్నులు విధించడానికి వీలు కల్పిస్తున్న జీఎస్టీ వల్ల మేకిన్ ఇండియా భావనకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తోందా.. కనీసం మొబైల్ ఉత్పత్తుల రంగంలో ఇది కరెక్టే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎదుకంటే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని ప్రభుత్వం

మేకిన్ ఇండియా అంటే దేశంలో తయారయ్యే ఫోన్లపై పన్నులా.. హవ్వ..
హైదరాబాద్ , శనివారం, 20 మే 2017 (05:48 IST)
దేశమంతా వస్తుసేవలపై ఒకే రకం పన్నులు విధించడానికి వీలు కల్పిస్తున్న జీఎస్టీ వల్ల మేకిన్ ఇండియా భావనకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తోందా.. కనీసం మొబైల్ ఉత్పత్తుల రంగంలో ఇది కరెక్టే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎదుకంటే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ)ని ప్రభుత్వం 12 శాతంగా నిర్ణయించడంతో చాలా వరకు మొబైల్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. దీంతో స్థానికంగా మొబైల్స్ తయారుచేసే కంపెనీలకు ప్రభుత్వం ఇంటెన్సివ్‌లు ప్రకటించి ‘మేకిన్ ఇండియా’కు ఊతం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ తయారీదారులైన ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీలకు ఇది ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నారు. 
 
తాజా జీఎస్‌టీ రేటు ప్రకారం దిగుమతి చేసుకున్న ఫోన్లు చవగ్గా లభించనుండగా భారత్‌లో తయారయ్యే ఫోన్లు మరంత ఖరీదు కానున్నాయి.
జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలో 5.9 కోట్ల ఫోన్లు అమ్ముడు కాగా అందులో 80 శాతం ఫోన్లు స్థానికంగా తయారైనవే. గతేడాది 26.5 కోట్ల ఫోన్లు అమ్ముడు పోగా అందులో 65 శాతం స్థానికంగా తయారు చేసినవే కావడం గమనార్హం. 
 
దీంతో స్థానికంగా తయారైన ఫోన్లు, దిగుమతి చేసుకున్న ఫోన్ల మధ్య వ్యత్యాసం చూపేందుకు మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీని విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జూలై 1 నుంచే కొత్త జీఎస్‌టీ విధానం అమల్లోకి రానుండడంతో ఆలోపే ఈ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని తయారీ పరిశ్రమ కోరుతోంది.
 
గురువారం రాత్రి జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం సెల్యులార్, ఇతర వైర్‌లెస్ నెట్‌వర్క్ కోసం తయారుచేసే టెలిఫోన్లు, విడిభాగాలకు 12 శాతం పన్నురేటు విధించారు. ఫలితంగా భారత్ దిగుమతి చేసుకునే ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టగా స్థానికంగా తయారైన ఫోన్ల రేట్లు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
 
ఇదెలా సాధ్యం అంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుని భారత్‌లో విక్రయించే ఫోన్ల సుంకం 17 శాతం నుంచి 27 శాతంగా ఉంది. ఇప్పుడది 12 శాతానికి తగ్గింది. దీనివల్ల దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా భారత్‌లో తయారుచేసి విక్రయించే ఫోన్లు మాత్రం వ్యాట్‌తో కలపుకుని 7.5-8 శాతం నుంచి 17 శాతం మధ్యలో ఉంది. అంటే తేడా 5 శాతం నుంచి 14.5 శాతం. ఇప్పుడది 12 శాతం అయింది. అంటే ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందన్నమాట. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు విక్రయించే ఫోన్లు ఇక ముందు మరింత కాస్ట్‌లీ కానున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
 
అందుకే జూలై 1లోపే మొబైల్ కొనుక్కోండి.. ఆ తర్వాత కొనలేరు అనే ప్రచారం బాగా పుంజుకుంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ-ఏపి మధ్య వివాదాల్లేవు... కానీ సెక్షన్ 108 పొడిగించాల్సిందే... కాల్వ, పరకాల