Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిగుమతి సుంకాలను తగ్గించిన కేంద్రం.. దిగిరానున్న వంట నూనెలు

Sunflower
, బుధవారం, 25 మే 2022 (09:32 IST)
దేశంలో వంట నూనెల ధరలు ఆకాశంలో ఉన్నాయి. వీటి ధరలను చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరగుతున్న యుద్ధం కారణంగా దేశంలో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, ఇంధన ధరలు, వంట నూనెల ధరలు రాకెట్ వేగంతో పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో పెరిగిన నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, నూనెల దిగుమతిపై వసూలు చేస్తున్న కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం తొలగించింది. ఈ విషయాన్ని మంళవారం ప్రకటించింది. 
 
ఏడాదికి 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) నూనె, మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. 
 
కాగా, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో వంట నూనెల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు స్వాగతించి ఇపుడు వ్యతిరేకిస్తారా? మంత్రి విశ్వరూప్ ప్రశ్న