హైదరాబాద్: టెక్ ఆధారిత ఆరోగ్య సేవా ప్లాట్ఫాం ప్రిస్టిన్ కేర్ (Pristyn Care) ఈరోజు నగరంలో తన తొలి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడంతో హైదరాబాద్ శస్త్రచికిత్సా బాధ్యతల్లో కొత్త అంచనాలుకి ఎదగబోతోంది. అదే రోజులో గుర్గావ్-కొచ్చి ఆసుపత్రుల విస్తరణ కూడా కలిపి నిర్వహించిన ఈ కార్యక్రమంతో, ప్రిస్టిన్ కేర్ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8 ఆసుపత్రులతో సుమారు 400 పడకలు, 20కు పైగా మొడ్యూలర్ ఆపరేటింగ్ థియేటర్లు, 55 ఐసీయూ పడకలు, 40 నీయోనేటల్ ఐసీయూ పడకలు, కేవలం నాలుగు నెలల్లోనే ఆసుపత్రి కార్యకలాపాల్లో అడుగుపెట్టి గణనీయమైన విస్తరణ సాధించింది. త్వరలోనే మరిన్ని ఆసుపత్రులు తెరుచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
హైదరాబాద్ కేంద్ర విశేషాలు
104 పడకలు
4 మొడ్యూలర్ ఆపరేటింగ్ థియేటర్లు
24×7 అత్యవసర విభాగం
హై-డిపెండెన్సీ ఐసీయూ
ఇవి టెక్నాలజీ పరంగా మరింత ముందడుగు వేయడానికి ప్రిస్టిన్ కేర్ సిద్ధం చేసింది: క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు, ఇన్సూరెన్స్ వర్క్ఫ్లోలు, ఆటోమేటెడ్ ల్యాబ్ డయాగ్నస్టిక్స్ అన్ని ఒకే సౌకర్యంగా పేషెంట్ జర్నీలో అనుసంధానమవుతాయి.
పేషెంట్లు పొందే ముఖ్యమైన లాభాలు
వన్-ట్యాప్ క్యాష్లెస్ అడ్మిషన్
రియల్-టైం ఖర్చుల
ప్రీఓపరేటివ్ డయాగ్నస్టిక్స్ నుంచీ ఎక్స్ప్రెస్ డిశ్చార్జ్ వరకూ తోడ్పడే పర్సనల్ కేర్ కోఆర్డినేటర్
“హైదరాబాద్ ఎప్పుడూ ఎదిగే నగరం. ఈ ప్రారంభంతో, మేము కేవలం విస్తరిస్తున్నట్టు కాదుకదా భవిష్యత్తు ఆరోగ్యసేవలు స్మార్ట్, టెక్-ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్లలోనే వుంటాయని మా నమ్మకాన్ని రెట్టింపుగా నిరూపిస్తున్నాం. ఇది క్లినికల్గా ఆధునికం మాత్రమే కాదు,మానవత్వంతో లోతుగా అలోచించి వేస్తున్న అడుగు,” అని డా. వైభవ్ కపూర్ పేర్కొన్నారు.