Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్పత్తిని నిలిపివేసిన హోండా : వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన

ఉత్పత్తిని నిలిపివేసిన హోండా : వెయ్యి మంది ఉద్యోగులకు ఉద్వాసన
, మంగళవారం, 12 నవంబరు 2019 (11:56 IST)
ద్విచక్రవాహనాల ఉత్పత్తి సంస్థ హోండా సంస్థ ఉత్పత్తిని నిలిపివేసింది. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా దేశంలో ద్విచక్రవాహనాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో హర్యానా రాష్ట్రంలోని మనేసర్ ఉత్పత్తి కేంద్రాన్ని హోండా కంపెనీ నిరవధికంగా మూసివేసింది. ఈ మేరకు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ ప్లాంటు కార్మికులు గత కొంతకాలంగా సమ్మె చేస్తుండగా, సాధారణ కార్యకలాపాలన్నీ నిలిపివేశామని సంస్థ ప్రకటించింది. యూనియన్ నేతలు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన చర్చలు సఫలం కాలేదని ఈ సందర్భంగా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
యూనియన్ నేతలు, శాశ్వత ఉద్యోగులు కలిసి కాంట్రాక్ట్ కార్మికులను రెచ్చగొడుతున్నాయని, కంపెనీ ప్రాంగణంలోనే వీరంతా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దిగారని హోండా ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో బైక్‌ల తయారీ సాధ్యం కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నామని, తిరిగి సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత, పనులు ప్రారంభమవుతాయని వెల్లడించింది.
 
కాగా, బైక్‌ల తయారీలో కోత విధించిన తర్వాత, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం కాగా, ఈ నెల 5 నుంచి హోండా కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, మిగతా ప్లాంట్ల యూనియన్లు మద్దతిస్తున్నాయి. ఇక్కడ రోజుకు తయారయ్యే బైక్‌ల సంఖ్య 6 వేల నుంచి 3,500కు తగ్గడంతో దాదాపు 1000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి నగర నిర్మాణం ప్రాజెక్టు నుంచి సింగపూర్ కంపెనీ నిష్క్రమణ