Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలయన్స్ రిటైల్‌లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు!!

రిలయన్స్ రిటైల్‌లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు!!
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (15:22 IST)
దేశ దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌లో మరో మల్టీ నేషనల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీలో పలు కంపెనీలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన విషయం తెల్సిందే. తాజాగా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం జనరల్ అట్లాంటిక్ పార్టనర్స్ కంపెనీ మరో 3,675 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేయనుంది. అంటే రిలయన్స్ రిటైల్‌లో 0.84 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఈ పెట్టుబడులు రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సహకరిస్తాయని తెలిపింది.
 
ఈ కొత్త పెట్టుబడితో రిలయన్స్ రిటైల్ విలువ 4.28 లక్షల కోట్లకు పెరిగినట్టు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సంస్థలోని 15 శాతం వాటాలను విక్రయించడం ద్వారా సుమారు రూ.63 వేల కోట్ల వరకూ నిధులను సమకూర్చుకోవాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలయన్స్ రిటైల్‌లో సిల్వర్ లేక్ పార్టనర్స్ 1.75 శాతం వాటాను, కేకేఆర్ అండ్ కో 1.28 శాతం వాటాలను కొనుగోలు చేయగా, 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడి వచ్చిందన్న విషయం తెలిసిందే.
 
ఇదిలావుండగా, తాజాగా రిటైల్ విభాగంలోనూ సంస్థ భాగం కావడం పట్ల అధినేత ముఖేష్ అంబానీ, తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. జనరల్ అట్లాంటిక్‌తో తమ సంబంధం సుదీర్ఘకాలం కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. జనరల్ అట్లాంటిక్ సంస్థ రిలయన్స్ జియోలో ఇప్పటికే రూ.6,598 కోట్లను పెట్టుబడిగా పెట్టింది. 
 
డిజిటల్ ఇండియాకు తమ వంతు సహకారాన్ని అందించడంతో పాటు భారత్‌లో రిటైల్ రంగం సానుకూల మార్పుల దిశగా సాగుతున్న వేళ, తమవంతు పాత్ర కూడా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ పెట్టుబడులు పెట్టినట్టు జనరల్ అట్లాంటిక్ సీసీఓ బిల్ ఫోర్డ్ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దసరా, దీపావళి సీజన్-అమేజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌లో 3లక్షల పోస్టులు