Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాకు కళలు, సంస్కృతి కంటే భారతదేశమే ముఖ్యం: పాక్ కళాకారుల నిషేధంపై ముఖేశ్..?

భారత్‌లోని పాక్ కళాకారులపై నిషేధం విధించాలనే డిమాండ్‌పై సర్వత్రా విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ పాక్ కళాకారుల పట్ల తన అభిప

Advertiesment
Ban
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:23 IST)
భారత్‌లోని పాక్ కళాకారులపై నిషేధం విధించాలనే డిమాండ్‌పై సర్వత్రా విభిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ పాక్ కళాకారుల పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు గొట్టినట్లు చెప్పారు. తనకు కళలు, సంస్కృతి కన్నా భారతదేశమే ముఖ్యమైనదని స్పష్టం చేశారు. 
 
ప్రముఖ పాత్రికేయులు శేఖర్ గుప్తా, బర్ఖా దత్ ఆధ్వర్యంలో 'ది ప్రింట్' సోమవారం రాత్రి నిర్వహించిన 'ఆఫ్ ది కఫ్' అనే కార్యక్రమంలో ముఖేశ్ అంబానీ మాట్లాడారు. పాకిస్థానీ కళాకారులపై నిషేధం విధించడంపై ముఖేష్ మాట్లాడుతూ.. తనకు దేశం కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు.

దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను మేధావిని కాను కాబట్టి తనకు ఇవేవీ అర్థం కావన్నారు. అందరి భారతీయుల్లాగానే తనకూ భారతదేశమే అగ్రస్థానంలో ఉంటుందని అంబానీ చెప్పుకొచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందాన్ని బట్టి మహిళలకు రేటింగ్ ఇవ్వడం ట్రంప్ శైలి : ఫెమినిస్ట్ గ్లోరియా స్టీనిమ్