Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాల ధరలను పెంచిన అమూల్ సంస్థ

పాల ధరలను పెంచిన అమూల్ సంస్థ
, సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (18:24 IST)
ప్రముఖ పాల ఉత్ప‌త్తుల సంస్థ‌ అమూల్ మహాశివరాత్రి సందర్భంగా అమూల్ తన వినియోగదారులకు ఒక‌రోజు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేసింది. పనిలో పనిగా తమ కస్టమర్లకు అమూల్ షాకిచ్చింది. అమూల్ పాల ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించింది. 
 
అమూల్ గోల్డ్ పాల ధర అరలీటర్ రూ.30 అవుతుంది. అలాగే అమూల్ అరలీటర్ పాల ధర రూ. 24, అమూల్ శక్తి 500 ఎంఎల్‌ రూ. 27కు అందుబాటులో ఉంటాయి. 
 
అమూల్ సంస్థ‌ దాదాపు 7 నెలల 27 రోజుల విరామం తర్వాత పాల ధరను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. చివరిగా జూలై, 2021 నెలలో రూ. లీటరుకు 2 పెంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శివరాత్రి సంగీత మహోత్సవాలు ప్రారంభం