Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిరిండియా శుభవార్త.. శ్రీనగర్ మార్గంలో చార్జీలను తగ్గింపు

ఎయిరిండియా శుభవార్త.. శ్రీనగర్ మార్గంలో చార్జీలను తగ్గింపు
, ఆదివారం, 4 ఆగస్టు 2019 (15:25 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా ఎయిరిండియా ఓ శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను రద్దు చేసిన విషయం తెల్సిందే. 
 
పైగా, పర్యటకులను, యాత్రికులను ఉన్నఫళంగా వెనక్కి తిరిగి రావాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఎయిరిండియాలో ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీనగర్‌ నుంచి ఢిల్లీ వెళ్లే మార్గంలో విమాన రేట్లు తగ్గిస్తున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిథి ధనుంజయ కుమార్‌ ఆదివారం ప్రకటించారు.
 
శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి సాధారణ ఛార్జ్‌ రూ.9500 కాగా, ప్రస్తుత తగ్గింపుతో రూ.6715గా, అలాగే ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు రూ.6,899 కానుంది. ఈ తగ్గింపు ఆగస్టు 15 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఎయిరిండియా అథారిటీ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 6,200 మంది ప్రయాణికులు శ్రీనగర్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తమ వద్ద నమోదు చేసుకున్నట్లు తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విమాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను కూడా నడుపుతున్నాయి. విమాన ఛార్జీల తగ్గింపుపై జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతోషం వ్యక్తంస్తూ, ఎయిరిండియాకు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లంక ముంపు గ్రామాల్లో నర్సాపురం ఎంపీ పర్యటన