భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి వ్యూహాత్మక మలుపును అందిస్తూ, మెస్సే ముయెన్చెన్ ఇండియా తమ ప్రధాన వాణిజ్య ప్రదర్శనలు- ఎలక్ట్రానిక్ ఇండియా, ప్రొడక్ట్రోనికా ఇండియాలు 2026 ఏప్రిల్ 8, 9, 10తేదీలలో ఢిల్లీ-NCR, బెంగళూరులో 2025 సెప్టెంబర్ 17,18,19 తేదీలలో జరుగుతాయని, అలాగే ప్రతి ఏటా ఈ వాణిజ్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు గ్రేటర్ నోయిడాలో జరిగిన అత్యున్నత స్థాయి పరిశ్రమ సమావేశంలో వెల్లడించింది.
డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బి. లాల్ మాట్లాడుతూ, “గ్లోబల్ ఎలక్ట్రానిక్స్లో భారతదేశం యొక్క పోటీతత్వానికి టెక్నాలజీ స్వీకరణ కీలకమైనది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా కొనుగోలుదారులు, సరఫరాదారుల మధ్య వేగవంతమైన అమరికను అనుమతిస్తుంది” అని అన్నారు. ప్రముఖ పరిశ్రమ సంస్థ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ELCINA) కూడా తన మద్దతును అందించింది. ELCINA సెక్రటరీ జనరల్ రాజూ గోయల్ మాట్లాడుతూ, “రెండు కీలక ప్రాంతాలలో ఈ వార్షిక ఫార్మాట్ ప్రస్తుత సందర్భంలో అవసరం..” అని అన్నారు.
ఫిక్కి ఎలక్ట్రానిక్స్ తయారీ కమిటీ చైర్ మనీష్ శర్మ మాట్లాడుతూ “మెస్సే ముయెంచెన్ భారతదేశం యొక్క డ్యూయల్-ఎడిషన్ ఫార్మాట్ ప్రాంతీయ లభ్యత, పెట్టుబడిదారుల విశ్వాసం, సాంకేతిక మార్పిడికి శక్తివంతమైన డ్రైవర్గా ఉంటుంది” అని అన్నారు. మెస్సే ముంచెన్ జీఎంబిహెచ్ సీఈఓ డాక్టర్ రీన్హార్డ్ ఫైఫర్ మాట్లాడుతూ “ఢిల్లీ-NCR , బెంగళూరులో జరిగే ఈ వార్షిక కార్యక్రమాలతో, పరిశ్రమకు ఆవిష్కరణలు, సరఫరాదారులు, భాగస్వామ్యాలకు సకాలంలో ప్రాంతీయ అవకాశాలను అందించడం ద్వారా భారతదేశం పట్ల మా నిబద్ధతను బలోపేతం చేస్తున్నాము..” అని అన్నారు.
ఈ ప్లాట్ఫారమ్ల ఔచిత్యాన్ని, పరిధిని మరింత విస్తృతం చేసే ప్రయత్నంలో, క్రికెట్ ఐకాన్ రోహిత్ శర్మ 2025-2026 సంవత్సరాలకు ఎలక్ట్రానిక్ ఇండియా, ప్రొడక్ట్రోనికా ఇండియాకు అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. "భారతదేశ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మేము దానితో పాటు అభివృద్ధి చెందుతున్నాము" అని IMEA అధ్యక్షుడు, మెస్సే ముంచెన్, సీఈఓ, మెస్సే ముంచెన్ ఇండియా భూపిందర్ సింగ్ అన్నారు.