Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?

చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుం

ఒత్తిడిలో వున్నారా? గోరువెచ్చని నీటిలో రోజ్ వాటర్ కలిపి?
, గురువారం, 14 సెప్టెంబరు 2017 (09:53 IST)
చర్మం కోమలంగా ఉంచుకోవాలంటే రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. చర్మం ఎక్కువగా పొడి బారినట్లు అనిపిస్తే మాయిశ్చరైజర్‌లో గులాబీ నీళ్లను కలిపి చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఎక్కువగా ఒత్తిడి గురైనట్లు అనిపిస్తే రాత్రి నిద్రించేందుకు ముందు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల గులాబీ నీళ్లను కలిపి స్నానం చేస్తే ఉపశమనం లభిస్తుంది. చర్మం కమిలినట్లు అనిపిస్తే గులాబీ నీళ్లలో కాటన్‌ను ముంచి ఆ ప్రాంతంలో ఉంచితే చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముఖానికి ఏదైనా మాస్క్ వేసుకుని దానిని తొలగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సహజసిద్ధంగా మాస్క్‌ని తొలగించుకోవాలంటే గులాబీ నీటిని వాడవచ్చు. ఒక గ్లాసులో గులాబీ వాటర్‌ను తీసుకుని అందులో కాటన్ ముంచి ముఖంపై ఉన్న మాస్క్‌ను నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేట్ కాకుండా ఉంటుందని బ్యూటీషియన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరుశెనగలు వేయించి కాదు.. నీటిలో ఉడికించి తినండి..