Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దంతాలపై ఈ నూనెతో మర్దన చేస్తే మిలమిలలాడుతాయి

దంతాలపై ఈ నూనెతో మర్దన చేస్తే మిలమిలలాడుతాయి
, శనివారం, 29 మే 2021 (23:15 IST)
నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.
 
తలకి సంబంధించినంత వరకూ ఆముదం, భృంగరాజ్, ఆలివ్, కొబ్బరి, మందార నూనెలు మేలు చేస్తాయి. ఇవి జట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. వీటిని విడివిడిగా కానీ, కలిపికానీ వాడుకోవచ్చు. షాంపుతోపాటు ఇలా రెండుమూడు చక్కల నూనె వాడితే తలస్నానానికి కండిషనర్‌తో పనుండదు. 
 
ఆముదం కనుబొమల అందానికి ఎంతో ఉపకరిస్తుంది. రెండుమూడు చుక్కల ఆముదాన్ని పట్టించి రాత్రంతా వదిలేయండి. ఇందులోని మాంసకృత్తులు కనుబొమలు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి. పాత మస్కారా బ్రష్‌ని ఆముదంలో ముంచి అద్దితే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి.
 
యాక్నె వంటి సమస్యలుంటే టీట్రీ నూనె చక్కగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు పోవడానికి విటమిన్ 'ఇ' నూనె వాడటం మేలు. చేతివేళ్లు బాగా పొడిబారి తెగినట్లు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు గోళ్ల చుట్టూ ఉన్న చర్మంపైకి లేచి ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాదం నూనె రాస్తే అక్కడి చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా మారుతుంది. 
 
పాదాలు పొడిబారితే... ముందుగా గోరువెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చుక్కలు పెప్పర్‌మింట్ నూనె కలిపిన ఆలివ్ నూనె అరి పాదాలకు రాస్తే సమస్య తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంత ప్రయత్నించినా నిద్ర రావడంలేదా? ఇలా చేస్తే..