Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముఖ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుకోవడానికి...

ముఖ చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుకోవడానికి...
, శనివారం, 20 జులై 2019 (20:37 IST)
1. చర్మం సున్నితంగా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడితాపాన్ని తగ్గించి చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
2. టమోటోను తీసుకొని వాటిని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్ మీల్ మరియు ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్ టాన్ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
 
3. వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని ఒక శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో, తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి మొటిమలు మీద రాసి , 10 నుండి 15 నిమిషాల  తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.
 
4. ఒక క్యారెట్‌ని తురుముకుని కొంచెం నీరు పోసి ఉడకపెట్టాలి. చల్లారిన తరువాత కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆగిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
 
5. ఒక టీస్పూన్ కొబ్బరినూనెలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేతివేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. 10 నిముషాల తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్నపిల్లల్లో పెరుగుతున్న కంటి సమస్య... ఈ పదార్థాలు తీసుకుంటే?