Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెడిక్యూర్‍‌తో పాదాలు పదిలం..

పెడిక్యూర్‍‌తో పాదాలు పదిలం..
, శుక్రవారం, 18 ఆగస్టు 2023 (10:57 IST)
చాలా మంది యువతీ యువకులు, స్త్రీపురుషుల పాదాలు పగిలిపోయి ఉంటాయి. ఇలాంటి వారు తమ పాదాలను కోమలంగా ఉంచుకునేందుకు తమకు తోచిన విధంగా వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తుంటారు. నిజానికి పాదాలు కోమలంగా ఉండాలంటే పెడిక్యూర్ చేసుకోవాలి. దీన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇదిగో ఇలా ఇంట్లోనే సన్నద్ధం కావాలి. 
 
* నీళ్లు అర బక్కెట్
* గ్లిజరిన్ - రెండు చెంచాలు
* నిమ్మకాయలు - రెండు
* షాంపూ ప్యాకెట్ - 1
* రాతి ఉప్పు - రెండు చెంచాలు. 
 
పెడిక్యూర్ ఇలా చేయాలి.. 
నీళ్లు గోరువెచ్చగా అయ్యే వరకూ వేడిచేయాలి. ఈ నీళ్లను బక్కెట్లో నింపి, పైన చెప్పినవన్నీ కలపాలి. ఉప్పు, షాంపూ కరిగేవరకూ నీళ్లను కలియబెట్టాలి. ఈ నీళ్లలో కాలి గిలకలు మునిగేలా పది నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత పాదాలకు సబ్బు రుద్ది పనికిరాని టూత్ బ్రష్‌తో పాదాలు, మడమలు, వేళ్లు, గోళ్లు రుద్దుకోవాలి. తర్వాత ప్యుమిస్ స్టోన్‌తో రుద్ది మృత చర్మాన్ని తొలగించాలి. తర్వాత ఎక్కువ నీళ్లతో కాళ్లు రుద్ది కడిగేసుకోవాలి. చివరగా పాదాలు తడి లేకుండా తుడిచి కొబ్బరినూనె లేదా వెన్న పూసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్మోన్లను ఏ విధంగా గాడిలో పెట్టాలంటే...