Publish Date: Sat, 01 Dec 2018 (12:51 IST)
Updated Date: Sat, 01 Dec 2018 (14:35 IST)
చాలామందికి కంటి కింద నల్లనల్లని మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ మచ్చల కారణంగా ఇన్ఫెక్షన్స్ ఏర్పడే అవకాశాలున్నాయి. వీటిని తొలగించాలంటే ఈ చిట్కాలు పాటించాలి.
బాదం పప్పును నానబెట్టి ఆ తరువాత మెత్తటి పేస్టులా చేసుకుని అందులో కొద్దిగా పచ్చి బంగాళాదుంప తురుము కలిపి కంటి కింద రాసుకుంటే వలయాలు మాయమవుతాయు. బాదం నూనెతో కంటి చుట్టూ మర్దన చేసుకుంటే కూడా సమస్య అదుపులో ఉంటుంది.
కళ్ల కింద ముడతలు ఉంటే ఫ్రిజ్లో ఉంచిన టీ బ్యాగ్లను ఓ 15 నిమషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. కొన్ని కారణాల వలన కొందరికి నేత్రాలు పొడిగా మారుతాయి. పొడికళ్లు మంట, దురదకు లోనై కనుగుడ్డుకు నష్టం కలిగిస్తాయి.
కాలుష్యం, వయసు పైబడడం తదితర కొన్ని రకాల సమస్యల కారణంగా కళ్ళలో నీరు సరిపోయినంత తయారుకాకుండా ప్రభావితం చేస్తాయి. రోజుకు మూడు లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వలన సమస్యను అధిగమించవచ్చు. దోసకాయ ముక్కలను 10 నిమిషాలు పాటు కళ్లపై ఉంచుకుంటే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి.