Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శెనగపిండిని.. తేనెను కలిపి పేస్టులా ముఖానికి పట్టిస్తే..

చర్మం కాంతివంతంగా ఉండేందుకు తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిబ్యాక్టీరియల్‌ ప్రాపర్టీస్‌ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. తేనెను నేరుగా చర్మం మీద పూసుకోవచ్చు. అది బా

శెనగపిండిని.. తేనెను కలిపి పేస్టులా ముఖానికి పట్టిస్తే..
, గురువారం, 18 ఆగస్టు 2016 (11:00 IST)
చర్మం కాంతివంతంగా ఉండేందుకు తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. తేనెలో యాంటిబ్యాక్టీరియల్‌ ప్రాపర్టీస్‌ పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు రావు. తేనెను నేరుగా చర్మం మీద పూసుకోవచ్చు. అది బాగా ఆరిన తర్వాత గోరువెచ్చటి నీళ్లతో చర్మాన్ని కడిగేసుకోవాలి. తేనెలోని నీరు చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. 
 
అంతేకాదు స్కిన్‌ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. ఇలా రోజూ చేయొచ్చు లేదా రోజు విడిచి రోజు చేయొచ్చు. అలాగే రెండు టీస్పూన్ల పాలు, ఒక టీస్పూను తేనెలో ఒక టీస్పూను శెనగపిండి కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖం ఎంతో కాంతివంతమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసులో పని ఒత్తిడా? ఇంటికెళ్లగానే భార్యను కౌగిలించుకోండి