Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆముదం గింజల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే..?

ఆముదం గింజల పేస్ట్‌ను చర్మానికి రాసుకుంటే..?
, బుధవారం, 26 డిశెంబరు 2018 (13:58 IST)
సాధారణంగా చాలామందికి చర్మంపై మచ్చలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా లాభం ఉండదు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే.. చాలంటున్నారు బ్యూటీషన్లు. మరి అవేంటో చూద్దాం..
 
1. జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు స్ట్రాబెర్రీ రసం రాసుకుంటే బ్లీచ్‌లా పనిచేస్తుంది.
 
2. యాపిల్ గుజ్జును మచ్చలపై రుద్ధి కాసేపయ్యాక చన్నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గి ముఖం మృదువుగా మారుతుంది.
 
3. ద్రాక్షపండ్ల గుజ్జును రోజుకు రెండుసార్లు ముఖానికి రాస్తుంటే మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
 
4. బొప్పాయి గుజ్జును పూతలా వేసి 10 నుంచి 15 నిమిషాల తరవాత చల్లని నీటితో కడిగితే ఎంతో మార్పు ఉంటుంది.
 
5. బాదం పప్పు గుజ్జులో గ్లూకోజ్ పౌడర్ కొద్దిగా కలిపి ముఖానికి రాసుకున్నా మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
 
6. నారింజ తొక్కలను పొడి చేసి అరటి పండు గుజ్జులో కలిపి పూతగా వేసి ఆరాక గోరువెచ్చటి నీళ్లతో కడిగితే మచ్చలు తగ్గుతాయి.
 
7. ఆముదం గింజలను నానబెట్టి గుజ్జు చేసి మచ్చలున్న చోట పూతలా వేసుకొని పావుగంటయ్యాక చన్నీటితో కడిగితే సరిపోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగానికి వెళ్లిన తర్వాతనే తెలిసింది.. చదువు విలువ..?