Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిళ్ళ గన్నేరుతో ఆమడదూరం పారిపోయే మధుమేహం (video)

బిళ్ళ గన్నేరుతో ఆమడదూరం పారిపోయే మధుమేహం (video)
, శుక్రవారం, 3 మే 2019 (14:38 IST)
అవును బిళ్ళ గన్నేరుతో మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చు. బిళ్లగన్నేరు ఆకుల్ని లేదా పువ్వుల రేకుల్ని తీసుకోవడం ద్వారా షుగర్ ఆమడదూరం పారిపోతుంది. బిళ్ళగన్నేరు ఆకులను మెత్తగా నూరి రాసుకుంటే అలెర్జీ మాయమవుతుంది.


పురుగులు, కీటకాలు కుట్టిన ప్రదేశంలో బిళ్ళ గన్నేరు ఆకుల పేస్ట్‌ని రాసినట్లైతే.. వాపు తగ్గిపోతుంది. చర్మ సమస్యలను బిళ్ళ గన్నేరు ఆకుల పేస్టును రాస్తే తొలగించుకోవచ్చు.
 
బిళ్ళ గన్నేరు మొక్క వేరుని తీసుకొని.. రెండు గ్లాసుడు నీటిలో వేసి సన్నని సెగ పైన పెట్టి కాషాయం లాగా చెయ్యాలి. ఆ కషాయం ఒక గ్లాసు వరకు వచ్చేదాక కాచిన తర్వాత వడకట్టి దీంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని రోజు తాగితే 48 రోజుల్లో షుగర్ లెవెల్ తగ్గుతుంది. కిడ్నీలో వాపు, కిడ్నీ వ్యాధులు దూరమవుతాయి. క్యాన్సర్, మధుమేహం దరిచేరవు.  
 
ఇక బిళ్ళ గన్నేరు పువ్వుల రేకులను ఓ గుప్పెడు తీసుకుని రెండు గ్లాసుల నీటిలో కాచి.. వడపోసి.. అర స్పూన్ మిరియాల మిడి చేర్చి.. తాగితే  బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్ వ్యాధి అంటవు.

ఇంకా మొలలు కూడా తగ్గుతాయి. బిళ్ళగన్నేరు పువ్వుల రేకులను కషాయంలా తయారు చేసుకుని మిరియాల పొడిని చేర్చకుండా.. ఆ నీటితో మొలలున్న ప్రాంతంలో రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వడదెబ్బ ఎందుకు తగులుతుంది?