Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దోమలు కుట్టి చర్మం దద్దుర్లు, దురదలా.. చింతపండు గుజ్జుతో..?

ఈ కాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వలన చర్మమంతా దద్దుర్లు, దురదగా ఉంటుంది. ఇవి కుట్టినప్పుడు అంతగా నొప్పి తెలియదు. కానీ కాసేపటి తరువాత నొప్పి ఎక్కువై చర్మం ఎర్రగా మారుతుంది. దోమల ప్రభావం వలన వాటి నుండి ఏర్పడిన దద్దుర్లు తొలగిపోయే

దోమలు కుట్టి చర్మం దద్దుర్లు, దురదలా.. చింతపండు గుజ్జుతో..?
, బుధవారం, 26 సెప్టెంబరు 2018 (16:02 IST)
ఈ కాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వలన చర్మమంతా దద్దుర్లు, దురదగా ఉంటుంది. ఇవి కుట్టినప్పుడు అంతగా నొప్పి తెలియదు. కానీ కాసేపటి తరువాత నొప్పి ఎక్కువై చర్మం ఎర్రగా మారుతుంది. దోమల ప్రభావం వలన వాటి నుండి ఏర్పడిన దద్దుర్లు తొలగిపోయేందుకు ఈ క్రింద తెలుపబడిన పదార్థాలు చాలా ఉపయోగపడుతాయి. మరి ఆ పదార్థాలేంటో తెలుసుకుందాం.
 
వాముని వేయించుకుని పొడిచేసి అందులో కొద్దిగా బెల్లం కలిపి ఉండల్లా చేసుకుని రోజూకు రెండుపూటలా సేవిస్తే దద్దుర్ల వలన ఏర్పడే మంట తొలగిపోతుంది. రాగిపాత్రలో కాస్త చింతపండు గుజ్జును నానబెట్టుకుని ఉంచుకోవాలి. దోమట కుట్టి దద్దుర్లు వచ్చినప్పుడు ఈ మిశ్రమాన్ని ఆ ప్రాంతాలో పూతలా వేసుకోవాలి. ఇలా చేయడం వలన దద్దుర్లు, దురదలు తగ్గు ముఖం పడుతాయి. 

అల్లం ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ అల్లం చిన్న ముక్కలుగా కట్‌‌చేసి వీటిల్లో కొద్దిగా సైంధవ లవణాన్ని కలుపుకుని ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మిరియాలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. వీటిని పొడిచేసుకుని వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పొడిని కలుపుకుని ఆహారంగా తీసుకుంటే దద్దుర్లు తగ్గిపోతాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్స్, పెరుగుతో ఫేస్‌ప్యాక్.. నల్లటి వలయాలు..?