Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాబ్లెట్ మింగకుండానే.. జలుబు మటాష్.. ఎలా..? ఇదిగోండి సింపుల్ చిట్కా..

చలికాలం వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని జలుబు ఆవహిస్తుంది. జలుబుకు జ్వరం కూడా తోడవుతుంది. అలాంటి వారు మీరైతే ఈ చిట్కా పాటించండి. జలుబును దూరం చేసుకోవాలం

టాబ్లెట్ మింగకుండానే.. జలుబు మటాష్.. ఎలా..? ఇదిగోండి సింపుల్ చిట్కా..
, మంగళవారం, 1 నవంబరు 2016 (15:52 IST)
చలికాలం వచ్చేస్తుంది. వాతావరణంలో మార్పు కారణంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని జలుబు ఆవహిస్తుంది. జలుబుకు జ్వరం కూడా తోడవుతుంది. అలాంటి వారు మీరైతే ఈ చిట్కా పాటించండి. జలుబును దూరం చేసుకోవాలంటే.. ఈ చిట్కాను పాటిస్తే సరిపోతుంది. మూడు నిమ్మకాయలను తీసుకుని.. వాటిని సగానికి కట్ చేసి ఓ పాత్రలో వేసుకుని అందులో నాలుగు గ్లాసుల నీరు చేర్చండి. 
 
ఈ నిమ్మకాయలకు కాసింత ఉప్పు కూడా చేర్చుకోండి. ఆపై నిమ్మకాయ, నీరు, ఉప్పుతో కూడిన పాత్రను స్టౌ మీద పెట్టి మరిగించండి. ఇంకా నాలుగు గ్లాసుల నీరు రెండు గ్లాసులయ్యేంత వరకు మరిగాక స్టౌ ఆఫ్ చేయండి. ఆపై పాత్రలో నీటిలో మరిగిన నిమ్మకాయలను తీసి రసం పిండుకుని మరిగించిన నీటితో కలుపుకోవాలి. 
 
ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు రాత్రి నిద్రించేందుకు అరగంటకు ముందు సేవిస్తే.. జలుబు మటాష్ అయినట్లే. ఈ కషాయాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలోని మలినాలు స్వేదం ద్వారా వెలివేయబడతాయని.. జలుబు కూడా తగ్గిపోతుందని.. తద్వారా జలుబు కోసం టాబ్లెట్లు మింగాల్సిన పని ఉండదంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలు బెల్లం క‌లిపి తాగితే... బ‌రువు త‌గ్గుతారు