Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద అమరసంజీవని నేరేడు

వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది

డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద అమరసంజీవని నేరేడు
, సోమవారం, 27 మార్చి 2017 (12:52 IST)
వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
 
సాధారణంగా వేసవిలో లభించే మామిడి, పుచ్చకాయలను డయాబెటిక్ రోగులు ఆరగించలేరు. ఎందుకంటే ఈ పండ్లను ఆరగించడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ నేరేడు పండ్లను ఆరగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
 
ఇందులో ఆమ్లాలు, ఆక్సలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉండటంతో ఈ పండుకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండ్లను ఉప్పు, చక్కెర, కారం కలుపుని తింటుంటారు. నేరేడును నీటితో శుభ్రంగా కడిగి తినాలి.
 
అంతేకాకుండా, ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. ఈ పండు కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటుంది. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతు ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టుకతో వచ్చే లోపాలను ఆ పప్పులతో చెక్ పెట్టొచ్చు!