Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ(కె.రామకృష్ణపరమహంస-అనంతపురం)

Advertiesment
dr raman astrology
, శుక్రవారం, 4 మార్చి 2016 (21:35 IST)
కె.రామకృష్ణపరమహంస-అనంతపురం: మీరు విదియ శుక్రవారం మిధున లగ్నము స్వాతి నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకూ ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినట్లయితే మీ దోషాలు తొలగిపోతాయి. కుటుంబ స్థానాధిపతి అయిన చంద్రుడు పంచమము నందు ఉండి, శనిచే వీక్షించడం వల్ల కుటుంబ సౌఖ్యం లేకపోవడం, అశాంతి వంటివి ఎదుర్కొంటారు. 
 
2017 తదుపరి మీ సమస్యలు పరిష్కరించబడతాయి. 2018 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని స్థిరత్వాన్ని, సంకల్పసిద్ధిని ఇస్తాడు. ప్రతిరోజూ భ్రమరాంబికా అష్టకం చదవడం వల్ల లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. దేవాలయాలలో కానీ మద్ది చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

Share this Story:

Follow Webdunia telugu