Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీపై అపార విశ్వాసముంది.. హోదా ఇస్తారు : వైకాపా ఎంపీ విజయసాయి

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీపై తమకు అపార విశ్వాసం ఉందని చెప్పారు.

మోడీపై అపార విశ్వాసముంది.. హోదా ఇస్తారు : వైకాపా ఎంపీ విజయసాయి
, ఆదివారం, 11 మార్చి 2018 (15:52 IST)
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ముందుకు సాగుతామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీపై తమకు అపార విశ్వాసం ఉందని చెప్పారు. ఆయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని తెలిపారు.
 
తమ పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందని, ఏపీకి హోదా ఇచ్చే వారికే మద్దతు ఇస్తామని పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది కదా, మరి ఆ పార్టీతో కలుస్తారా? అన్న రాజ్‌దీప్ వ్యాఖ్యలను విజయసాయి కొట్టిపడేశారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కాబట్టి ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. 
 
బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోడీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటే ఆ పార్టీతో వైసీపీ జత కడుతుందా? అన్న ప్రశ్నకు విజయసాయి మాట్లాడుతూ, హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు.. నిర్ణయం బాధ కలిగించింది : వర్ల రామయ్య