Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోవడానికి ప్లాన్ : వైకాపా రెబెల్ ఎంపీ

రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోవడానికి ప్లాన్ : వైకాపా రెబెల్ ఎంపీ
, మంగళవారం, 16 మార్చి 2021 (16:34 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలను సాకుగా చూపి రాత్రిరాత్రే దుకాణం సర్దేయడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నారని ఆయన ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజలు తీర్పు ఇచ్చారని... ఇక్కడ రాజధాని వద్దంటున్నారని కోర్టుకు తమ ప్రభుత్వం చెప్పనుందన్నారు. ఓ మహానుభావుడు ముహూర్తం పెట్టారట... మూటాముళ్లే సర్దుకుని ఆయన వెళ్లిపోతారట. అధికారుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లపై పలు సూచనలు చేశారట. ఈ అప్రతిహత విజయాన్నిసాకుగా చూపి... ఇక్కడి నుంచి రాత్రికి రాత్రి దుకాణం కట్టేసి లేచిపోదామని అనుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాత్రికి రాత్రే లేచిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. లీగల్‌గా ఇది చెల్లదు. వందలాది సలహాదారులు మీకు సలహా ఇవ్వడం లేదా? 20 సార్లు ముహూర్తం పెట్టారు. మధ్యలోనే ఆగిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సచివాలయం అనేది ఇక్కడే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దళిత ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి : ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి