Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా అన్న జగన్ మానసికస్థితి భయంగా ఉంది .. అందుకే అద్దం పంపుతున్నా : వైఎస్ షర్మిల

ys sharmila

ఠాగూర్

, శనివారం, 4 మే 2024 (17:57 IST)
తన అన్న, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానంటూ అన్న జగన్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. పైగా, మా అన్న జగన్ మానసికస్థితిని చూస్తే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. తన అన్న జగన్‌కు చంద్రబాబు పిచ్చి పట్టుకుందంట, అందుకే ఆయనకు ఓ అద్దాన్ని పంపుతున్నట్టు చెప్పారు. 
 
ఆమె శనివారం కడపలో విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుతో తాను చేతులు కలిపానని, చంద్రబాబు చెప్పినట్టుగా తాను ఆడుతున్నానని, తన రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉందంటూ జగన్ పదేపదే అంటున్నారని, ఎలాంటి ఆధారాలతో ఇలాంటి ప్రచారం చేస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు. పైగా, చంద్రబాబుతో ఈ వైఎస్ఆర్ బిడ్డ, వైఎస్ఆర్ వారసురాలు చేతులు కలిపిందని నిరూపించగలరా అని ఆమె సవాల్ విసిరారు. 
 
చంద్రబాబు చెబితే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని అంటున్నారు. మరి ఆ నాడు చంద్రబాబు చెబితేనే జగన్ కోసం పాదయాత్ర చేశానా, సునీత కూడా చంద్రబాబుతో చేతులు కలిపారని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు మాట వింటారని చెబుతున్నారు. చంద్రబాబు ఎంతో పవర్ ఫుల్ అని చెబుతున్నారు. ఏం జరిగినా చంద్రబాబే కారణమని అంటున్నారు. జగన్‌‍కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది అని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతులకు తీపి కబురు చెప్పిన ప్రధాని మోడీ : ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత!!