Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 15వ తేదీన సీఎం జగన్ అమెరికా పర్యటన

Advertiesment
YS Jagan
, సోమవారం, 12 ఆగస్టు 2019 (18:37 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. తిరిగి 24వ తేదీన ఆయన తాడేపల్లికి చేరుకుంటారు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత అదే రోజు ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళతారు. 
 
అక్కడి నుంచి కుటుంబసభ్యులతో రాత్రికి శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరుతారు. సీఎం జగన్ చిన్న కుమార్తె వర్షా రెడ్డిని అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారని సమాచారం. 
 
ఈ నెల 17న డల్లాస్‌లోని కే బెయిలీ హచిసెన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉత్తర అమెరికాలోని తెలుగు ప్రజలతో జరిగే ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్యాగానికి ప్రతీక బక్రీద్.. వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్