Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్

వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చింది: భాజపా ఎమ్మెల్సీ మాధవ్
, ఆదివారం, 9 జనవరి 2022 (22:23 IST)
రాష్ట్రప్రభుత్వం మొదటిసారి ఆర్థిక పరిస్థితి బాగోలేదని సిఎం జగన్ కేంద్రాన్ని అడిగారన్నారు బిజెపి రాష్ట్ర కార్యదర్సి, ఎమ్మెల్సీ మాధవ్. పింఛను, జీతాలు ఇవ్వలేని స్థితిలో వైసిపి ప్రభుత్వం దేహి అనే దౌర్యాగ్య స్థితికి వచ్చిందన్నారు. 

 
ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడే విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులను నమ్మించి వైసిపి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు బిజెపి అండగా నిలుస్తుందన్నారు. 

 
గ్రామ సచివాలయ ఉద్యోగులకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ ప్రభుత్వం అందించాలన్నారు. విధివిధానాలు లేక గ్రామ సచివాలయ ఉద్యోగులు తల్లడిల్లిపోతున్నారన్నారు. సినిమా ధరలు తగ్గించి ఎవరినో ఇబ్బందులు గురిచేసే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. 

 
నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజల్ ధరలను విపరీతంగా ప్రభుత్వం పెంచేసిందన్నారు. పండుగలు వస్తే విపరీతంగా యాభై శాతం వరకు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదలపై అధిక భారం మోపుతోందన్నారు. ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.

 
పంజాబ్ లో ప్రధానిని అడ్డుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేని పార్టీగా దేశంలో ఉందన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ కరువైందని విమర్సించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబుగారు.. ఈ వయస్సులో ఈ స్టంట్‌లేంటి?