Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి కూల్‌డ్రింక్ ఇచ్చాడు.. మత్తులోకి వెళ్లాక పనికాచ్చేశాడు

హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధు

ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి కూల్‌డ్రింక్ ఇచ్చాడు.. మత్తులోకి వెళ్లాక పనికాచ్చేశాడు
, సోమవారం, 7 ఆగస్టు 2017 (18:35 IST)
హైదరాబాద్‌లో ఓ కామాంధుడి చేతిలో మరో మహిళ తన శీలాన్ని కోల్పోయింది. ఆకుకూరలు అమ్మే మహిళను ఇంట్లోకి పిలిచి.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుకలిపి ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన తర్వాత మహిళ మత్తులోకి జారుకోగానే కామాంధుడైన ఇంటి యజమాని తన పనికానిచ్చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్, పీర్జాదిగూడకు చెందిన షేక్‌ బాబు భార్య షేక్‌ మహబూబి(46) 20 ఏళ్లుగా ఆకుకూరలు విక్రయిస్తూ జీవిస్తోంది. ఈ నెల 4న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహబూబి ఆకుకూరలు విక్రయించేందుకు కృష్ణానగర్‌కు వచ్చింది. బస్తీకి చెందిన నీలా కృష్ణ ఆకు కూరలు కొనే నిమిత్తం మహబూబిని ఇంట్లోకి పిలిచాడు. 
 
ఇంట్లోకి వచ్చాక.. ఆకుకూరలు కట్ట తీసుకుని.. ఆమెకు మత్తుకలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చాడు. అది తాగిన మహబూబి మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత మహబూబిపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు మహబూబి తెలపడంతో కోపోద్రుక్తులైన కుటుంబ సభ్యులు కృష్ణానగర్‌కు వచ్చి నీలా కృష్ణపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన నీలా కృష్ణపై కేసు నమోదు చేయగా, కామాంధుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నైలోని యూఎస్ కాన్సుల్ జనరల్‌గా రాబర్ట్ బర్గెస్