Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరు రిగ్గింగ్‌ చేశారో.. ప్రమాణం చేద్దామా..?: పనబాక లక్ష్మి సవాల్‌

Advertiesment
rigging
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:34 IST)
‘ఇప్పటివరకు వైసీపీ నాయకులు సవాల్‌ విసిరారు. ఇప్పుడు నేను సవాల్‌ విసురుతున్నా. ఎవరు రిగ్గింగ్‌ చేశారనే దానిపై వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం (గురువారం) రోజున ప్రమాణం చేయడానికి సిద్ధమా’ అని టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు.

తిరుపతిలోని టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్మిట్లు లేని వందలాది బస్సుల్లో వచ్చిన వేలాది మంది పోలింగ్‌ కేంద్రాల వద్ద తిరుగుతున్నా కలెక్టర్‌, ఎస్పీ పట్టించుకోలేదన్నారు. తమ పరిధిలో లేదంటూ తమ ఫిర్యాదును పోలీసులు దాటవేయడం సరికాదన్నారు.

డీజీపీ సీసీ కెమెరాల ఫుటేజీలను చూస్తే నగరంలో ఏమి జరిగిందన్న వాస్తవాలు తెలుస్తాయన్నారు. పోలింగ్‌ ఏజెంట్లను, తమ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వత్తాసు పలికిన అధికారులపై తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుని తీరుతామన్నారు.

‘ఈవీఎంలను ఇళ్లలో పెట్టుకుని మీరే ఓట్లు వేసుకుంటే సరి. 16లక్షల మెజారిటీ కూడా వచ్చేది. ఆపై గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లోనూ ఎక్కవచ్చు’అంటూ ఎద్దేవా చేశారు. తిరుపతిలో రీపోలింగ్‌ జరపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి.. 4వేల మార్కును దాటిన కోవిడ్.. ఏపీలో 6వేల కేసులు