Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్తే మద్యం మత్తులో యువతిపై రేప్

స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్తే మద్యం మత్తులో యువతిపై రేప్
, గురువారం, 13 మే 2021 (11:49 IST)
స్నేహితుడితో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఓ యువతిపై మద్యం మత్తులో ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (21) 15 రోజుల కిందట అల్లవరంలోని తమ బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. ఆ సందర్భంగా స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్ర తీరానికి వెళ్లింది.
 
కాగా, మద్యం తాగి అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న సీతారామపురానికి చెందిన ఇద్దరు యువకులు, సత్యనారాయణ పురానికి చెందిన మరో వ్యక్తి వారి వద్దకు వచ్చారు. స్నేహితుడిని బంధించారు. అతడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత నగ్నంగా ఉండగా యువతి ఫొటోలు తీశారు. పది రోజుల తర్వాత వారిలో ఓ వ్యక్తి మళ్లీ తన కోరిక తీర్చాలని, లేదంటే నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
 
దాంతో బాధితురాలు బంధువులకు చెప్పడంతో వారు బుధవారం (మే 12,2021) అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆడపిల్లల తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేసింది. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన దురాఘాతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Covid: దేశంలో మళ్లీ 4వేల పైన మరణాలు