Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు

కుమార్తెతో సహజీవనం వద్దన్నాడు.. నాటు తుపాకీ తూటాకు బలయ్యాడు
, బుధవారం, 28 నవంబరు 2018 (08:31 IST)
నీకు పెళ్లై పిల్లలు ఉన్నారు. ఇపుడు నా కుమార్తెతో సహజీవనం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు అంటూ ప్రాధేయపడిన ఓ గిరిజనుడుని మరో ఆదివాసి నాటు తుపాకీతో కాల్చిచంపాడు. ఈ దారుణం వెస్ట్ గోదావరి జిల్లా వై.రామవరం మండలం రేగడిపాలెంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రేగడిపాలెం అనే గ్రామానికి చెందిన నరాకోట ఆదిరెడ్డికి పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఉంది. ఈమెతో అదే మండలంలోని దూసరపాము గ్రామానికి చెందిన గంగాధరరావు అలియాస్ దొరబాబు సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన ఆదిరెడ్డి.. దొరబాబును హెచ్చరించాడు. తన కుమార్తె జీవితాన్ని నాశనం చేయొద్దంటూ ప్రాధేయపడ్డాడు.
 
పెళ్ళై పిల్లలు ఉన్నవాడివి, తన కుమార్తెను వదిలిపెట్టాలని కోరాడు. ఈ మాటలకు కోపోద్రిక్తుడైన దొరబాబు నాటు తుపాకితో కాల్చి చంపాడు. ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో దొరబాబును పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం, నాటు తుపాకిని కలిగి ఉండటం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారు. అతని వద్ద నుంచి నాటు తుపాకి, 11 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోశామహల్ స్థానంలో పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి కిడ్నాప్???