Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్లు వేస్తామని 15 నెలలుగా ఎదురుచూస్తున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి

Advertiesment
Bolisetti Srinivas

ఐవీఆర్

, మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (17:12 IST)
నున్నటి తారు రోడ్లు వేస్తామని గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ... ప్రజలు మనకు మార్పు తీసుకువస్తామని ఓట్లు వేసామని అన్నారు. రోడ్లు వేస్తామని నమ్మకంతో చూస్తున్నారని అన్నారు.
 
గత 15 నెలలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారనీ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంబంధిత మంత్రిగారు రోడ్లు వేసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు కోరుకున్నట్లు మనం చేయకపోతే గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలు మనపై నమ్మకం కోల్పోతారంటూ ఆందోళన వ్యక్తం చేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజిట్ దుబాయ్, అగ్రశ్రేణి స్టాండ్-అప్ కళాకారులు బస్సి- హర్ష్‌లతో ప్రచార కార్యక్రమం