Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనకు మరో అణు క్షిపణి

మనకు మరో అణు క్షిపణి
, సోమవారం, 20 జనవరి 2020 (06:10 IST)
భారత అమ్ములపొదిలో మరో అణు క్షిపణి చేరింది. రెండు వరుస వైఫల్యాల తరువాత ఎట్టకేలకు కే4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. విశాఖపట్నం నుంచి 30 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేదించింది.

ఆదివారం నిర్వహించిన ఈ ప్రయోగం విజయవంతమైందని, అణు జలాంతర్గామి నుంచి 3500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని డీఆర్డీవో తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణిని ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌లో అమర్చేలా అభివృద్ధి చేశామని, 17 టన్నుల బరువుండే ఈ క్షిపణి రెండు టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదని డీఆర్డీవో తెలిపింది.

ఇదిలా ఉంటే 2019 నవంబర్‌లోనే ఈ క్షిపణి ప్రయోగం జరగాల్సిఉంది. కానీ అప్పట్లో బంగాళాఖాతంలో బుల్‌బుల్‌ తుపాన్‌ తీవ్రంగా ఉండడంతో ప్రయోగం వాయిదా పడింది. అయితే ఆదివారం నిర్వహించిన ప్రయోగం విజయవంతం కావడంతో సముద్రతలం నుంచి అణు క్షిపణులను ప్రయోగించగల ఆరో దేశంగా భారత్ అవతరించింది.

ఈ క్షిపణిని అణు జలాంతర్గాముల్లో అమర్చి సైన్యం చేతికి అందించేలోపు మరికొన్నిసార్లు ప్రయోగాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు డీఆర్డీవో తెలిపింది. డీఆర్డీవో అధికారులకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయి భక్తులకు శుభవార్త.. షిరిడీలో బంద్ విరమణ