Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగార్జున సాగర్ - ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏరో డ్రోమ్‌లు

నాగార్జున సాగర్ - ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏరో డ్రోమ్‌లు
, ఆదివారం, 18 జులై 2021 (12:40 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నీటిపై తేలియాడే ఏరో డ్రోమ్‌లు అందుబాటులోకిరానున్నాయి. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేయగా.. దేశ వ్యాప్తంగా తొలి దశలో 14 చోట్ల వీటిని ఏర్పాటు చేయనున్నారు. 
 
ఇందులోభాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణలోని నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమో‌లను అభివృద్ధి చేయనున్నారు. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్‌ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్‌ అధికారులు వెల్లడించారు. 
 
ఇందులోభాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్‌ డ్యామ్‌ వద్ద ఒక్కొక్క వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్‌ ఏరోడ్రోమ్‌లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్‌ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం