Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్టేషన్‌లో పోలీసులను నగ్నగంగా కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ!

sparun
, శుక్రవారం, 28 అక్టోబరు 2022 (08:15 IST)
సాధారణంగా వివిధ నేరాలకు పాల్పడేవారిని పోలీసులు అరెస్టు తమదైనశైలిలో విచారిస్తుంటారు. కొందరు నేరాగాళ్ల పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిని పోలీసులు బట్టలూడదీసి నగ్నంగా స్టేషన్‌లో కూర్చోబెడుతుంటారు. దుస్తులు విప్పించి స్టేషన్‌లో కూర్చోబెట్టడాన్ని మనం తరచూ వింటుంటాం కూడా. కానీ, పోలీసుల దుస్తులనే ఊడదీసి... స్టేషన్‌లో కూర్చోబెట్టాడు ఓ పోలీస్ ఉన్నతాధికారి. ఆయన పేరు అరుణ్. విజయనగరం జిల్లా ఎస్పీ. ఆయన ఇలా ఎందుకు నడుచుకున్నారో తెలుసుకుందాం. 
 
విజయనగరం పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేష్ మరికొందరు బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహేష్, అభిషేక్, మంజునాథ్, శ్రీకాంత్ అనే నలుగురు కానిస్టేబుళ్ళు పేకాట శిబిరంపై దాడి చేసి, పేకాట రాయుళ్ల నుంచి రూ.20 వేల నగదు, వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు కదా, స్వాధీనం చేసుకున్న డబ్బును, మొబైల్ ఫోనును స్వాహా చేశారు. మరుసటి రోజున వారు స్టేషన్‌కు వెళ్లి తమ మొబైల్ ఫోన్ ఇవ్వాలి పోలీసులను కోరగా, అలాంటి కేసు ఏదీ నమోదు కాలేదని చెప్పారు. దీంతో పోలీసులకు పేకాట రాయుళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ చెవిలోపడింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. 
 
ఈ విచారణలో పేకాట శిబిరంపై జరిగిన దాడి, నగదు, సెల్‌ఫోన్ కాజేసినట్టు తేలింది. దీంతో నలుగురు కానిస్టేబుళ్ళపై కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత వారి దుస్తులు విప్పించి రెండు గంటల పాటు స్టేషన్‌లో కూర్చోబెట్టారు. వారిని సస్పెండ్ చేసిన ఎస్పీ కోర్టు ఆదేశం మేరకు రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త శ్రేణి వాటర్ ప్యూరిఫైయర్లను ప్రారంభించిన హల్స్ ప్యూరిట్