Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు ... రైలు నుంచి వేరుపడిన బోగీలు

visakha express
, ఆదివారం, 18 సెప్టెంబరు 2022 (12:20 IST)
విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం పెనుముప్పు తప్పింది. ఏలూరు దగ్గర రన్నింగ్ ట్రైన్ నుంచి మూడు బోగీలు వేరుపడిపోయాయి. ఒక్కసారిగా బోగీలు రైలు నుంచి విడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో నెమ్మెదిగా ఆగే సమయంలో లింకు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
అయితే, బోగీల్లోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉండటంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఏలూరు రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు షిర్డీ నుంచి వస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్, ఇటు విశాఖకు వెళ్లాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రైల్వే స్టేషన్‌లో బాగా నెమ్మదించాయి. 
 
ఆ సమయంలోనే విశాఖ ఎక్స్‌ప్రెస్ బోగీల లింకు వేరుపడింది. ఫలితంగా విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్1, ఎస్2, ఎస్3 రైళ్లు బాగా విడిపోయాయి. అయితే ట్రైన్ చాలా నెమ్మదిగా వెళ్తున్న సమయంలో రైలు లింక్ ఊడిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నార్త్ ఇండియా మెంటాలిటీ : శరద్ పవర్ సంచలన వ్యాఖ్యలు