Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ కాలేజీ ఫ్యాకల్టీ ఆ పనిచేసింది.. విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్‌లో..?

suicide

సెల్వి

, శుక్రవారం, 29 మార్చి 2024 (17:48 IST)
మహిళలపై వేధింపులు ఎక్కడపడితే అక్కడ జరుగుతూనే వున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు అంతా ఇంతా కాదు. తాజాగా లైంగిక వేధింపుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
విశాఖ జిల్లాలో కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్టియర్ విద్యార్థిని రూప శ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ లైంగిక వేధింపులు భరించలేక శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనం పై నుంచి దూకేసింది. కళాశాల ఫ్యాకల్టీ అభ్యంతరకరమైన ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తుండటమే తన ఆత్మహత్యకు కారణమని మృతురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. 
 
కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఆ లేఖలో ఆమె తన తండ్రికి రాసింది. అసభ్యకరమైన ఫోటోలను తీసి వాటితో బెదిరించిందనీ.. ఆ ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్‌ని ప్రోత్సహిస్తే ఎవరికి చెప్పాలని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 
 
కాలేజీలకు వెళ్లలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక నలిగిపోతున్నాం. ఒకరు చస్తే కానీ ఈ విషయం ప్రపంచంలోకి రాదని తలచి తన ప్రాణాలు విడుస్తున్నట్లు ఆ లేఖలో మృతురాలు వెల్లడించింది. తనను క్షమించాలని ఆ లేఖ ద్వారా తల్లిదండ్రులను కోరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిట్టింగ్ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు : ఏడీఆర్ నివేదిక