Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సైకో పోవాలి.. సైకిల్ రావాలి... వైకాపా ఎమ్మెల్యేకు ఎంఎస్ బాబుకు షాక్

msbabu
, శుక్రవారం, 9 జూన్ 2023 (15:55 IST)
చిత్తూరు జిల్లా పూతలపట్టు వైకాపా ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు గ్రామస్థులు షాకిచ్చారు. గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల తోరణాలు, టీడీపీ జెండాలు, గోడల నిండా 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' పోస్టర్లు కనిపించాయి. ఆదేసమయంలో సైకో పోవాలి.. సైకిల్ రావాలి అనే పాట మైకులో హోరెత్తుతోంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. 
 
గురువారం బంగారుపాళ్యం మండలం మొగిలివా రిపల్లెలో ఈ పరిస్థితి ఎదురైంది. వైసీపీ నాయకులు జోక్యం చేసుకుని ఆ పాటను ఆపాలని గ్రామస్థులకు సూచించారు. వారు అంగీకరించలేదు. పైగా 'మా గ్రామానికి ఏం చేశారు? ఇప్పుడెందుకొచ్చారు? ఏనుగుల దాడుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?' అంటూ కారులోంచి దిగని ఎమ్మెల్యేను గట్టిగా ప్రశ్నించారు. 
 
ఆ వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పాటను నిలిపి వేయించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో 90 ఇళ్లు ఉండగా, రెండు ఇళ్లకు వద్దకు మాత్రమే ఎమ్మెల్యే వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వెనుదిరిగారు. మొగిలివారిపల్లెలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎదురైన నిరసన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తర కాశీని వీడి కట్టుబట్టలతో వెళ్లిపోతున్న భారతీయ ముస్లింలు... ఎందుకు?