Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లిచూపులకని బయలుదేరి తిరిగిరాని లోకాలకు... కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం....

ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది

పెళ్లిచూపులకని బయలుదేరి తిరిగిరాని లోకాలకు... కృష్ణాజిల్లా రోడ్డు ప్రమాదం....
, మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (12:45 IST)
ఇద్దరు సోదరుల్లో ఒకరేమో సాఫ్ట్వేర్ ఇంజినీర్, మరొకరు సీఆర్పీఎఫ్ డాక్టర్. వీళ్లద్దరూ ఒకేసారి పెళ్లి చూపులకు వెళ్లేందుకు ఆ మృత్యు శకటాన్ని ఎక్కారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వీరిది నల్గొండ జిల్లా సూర్యాపేట. 
 
నలబోతు కృష్ణారెడ్డి బెంగళూరులో ఇంజినీర్ గా పనిచేస్తుండగా ఆయన సోదరుడు శేఖర్ రెడ్డి ఒడిసాలో సీఆర్పీఎఫ్ డాక్టరుగా పనిచేస్తున్నారు. గరిడేపల్లి మండలం లోని కోదండరామపురంలో వీరిద్దరూ పెళ్లిచూపులకని వెళుతున్నారు. ఇంతలో ఈ దారుణ ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ఈ రోజు తెల్లవారు జామున ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా వీరిలో ఈ సోదరులు కూడా వున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్లామ‌ర్‌ను వ‌దిలేసి.. నామీద ప‌డటం వల్లే ఆస్కార్‌లో తప్పుదొర్లింది : డోనాల్డ్ ట‌్రంప్‌