Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్

ఓటు హక్కును వినియోగించుకున్న పవన్ కళ్యాణ్
, బుధవారం, 10 మార్చి 2021 (10:03 IST)
ఏపీలో జరుగుతున్న నగర, పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికల హైస్కూలో ఓటు వేశారు. 
 
పవన్ ఓటు వేసేందుకు వస్తున్నారని తెలియగానే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని పోలీసులు అదుపులు చేశారు. ప్రస్తుతం విజయవాడలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 
 
ఆయనతోపాటు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పవన్ వచ్చేసరికి పోలింగ్ కేంద్రం రద్దీగా ఉండటంతో ... ఆయన్ను ప్రత్యేకంగా లోనికి పంపేలా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం... పటమట లంకలో ఓటేసిన పవన్