Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కంట్రోల్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్

lokesh

ఠాగూర్

, మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (12:43 IST)
నీట మునిగిన విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యవేక్షణలో విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 
 
మంగళవారం సహాయక చర్యల్లో ఆరు హెలికాప్టర్లు ద్వారా ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. బోట్లు చేరుకోలేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహార సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆయన కోరారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ విజ్ఞప్తి మేరకు జక్కంపూడి వైఎస్‌ఆర్ కాలనీకి ప్రత్యేక హెలికాప్టర్‌లో 2,500 ఆహార పొట్లాలు చేరవేశారు. 
 
విజయవాడ పరిధిలో వరద ముంపుకు గురైన 32 వార్డుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రి లోకేష్ పిలుపు మేరకు సహాయ చర్యల్లో రాష్ట్రం నలుమూలల నుంచి విజయవాడకు పార్టీ శ్రేణులు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అలాగే, విజయవాడ డివిజన్ పరిధిలో 70 పునరావాస కేంద్రాల్లో 14,452 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. మరోవైపు, ప్రకాశం బ్యారేజి వద్ద వరద నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతుంది. ప్రస్తుత వరద ప్రవాహం 8,71,776 క్యూసెక్కులుగా ఉంది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరద బాధితులకు అండగా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్, విశ్వక్సేన్.. ఎంతిచ్చారంటే?