Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు?

vijayasaireddy
, బుధవారం, 9 నవంబరు 2022 (16:46 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైకా ఎంపీ  విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వేల ఎకరాల ఆసామి గీకం మూర్తి ఎక్కడ నుంచి వచ్చాడని అడిగారు. 
 
వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పాలని తెలిపారు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80శాతం  భూములు ఆక్రమిస్తే మిన్నకున్నారు కదా అంటూ మండిపడ్డారు. 
 
ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసనన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణాలోని గ్రానైట్ కంపెనీల్లో ముమ్మరంగా ఐటీ - ఈడీ సోదాలు