Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేను : వెంకయ్య నాయుడు

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

Advertiesment
venkaiah naidu
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:50 IST)
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనన్నారు. 
 
అయితే, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతైనా కేంద్రం ఇస్తుందని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్యాకేజీ వద్దంటున్న చంద్రబాబుకి మనమే కటీఫ్ చెపుదామా? బీజేపీ నేతల అంతర్మథనం