Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబు నోట క్షమాపణ మాట: వంశధార రైతుకు దక్కనున్న న్యాయం

వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పంట పండనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహార చెల్లింపులో జాప్యం జరిగినందుకు రైతులకు క్షమాపణ చెబుతున్నానని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు వారికి నష్టపరిహారంపై హామీ ఇచ్చారు.

బాబు నోట క్షమాపణ మాట: వంశధార రైతుకు దక్కనున్న న్యాయం
హైదరాబాద్ , మంగళవారం, 24 జనవరి 2017 (04:51 IST)
వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పంట పండనుంది. ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహార చెల్లింపులో జాప్యం జరిగినందుకు రైతులకు క్షమాపణ చెబుతున్నానని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టకేలకు వారికి నష్టపరిహారంపై హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు క్షమాపణ చెప్పడం చాలా అరుదైన విషయం.  అలాంటిది క్షమాపణతో పాటు రైతులకు ప్యాకేజీ ప్రకారం నేటినుంచే చెల్లింపులు చేసే ఏర్పాటు చేస్తామని చెప్పడం రైతులకు డబుల్ లబ్దిని చేకూర్చినట్లేనని భావిస్తున్నారు.
 
సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన చంద్రబాబు. వంశధార విషయంలో రైతులందరితో మాట్లాడి ప్యాకేజీ ప్రకటించామని.. ఆ తర్వాత జీవో కూడా ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. అయితే ఆ ఉత్తర్వులను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని, ఇది తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. స్థానిక జిల్లా యంత్రాంగం అలసత్వం వల్ల నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందుకు చింతిస్తున్నానన్నారు. రైతులకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. బాధితులందరికీ మంగళవారం నుంచే నష్టపరిహారం అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీ జలాల్లో కాంగ్రెస్ చేపలవేట.. ఇదీ ప్లాఫే అంటున్న స్వామి