Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...

వ్యక్తిని కాలికింద నలిపేసి చంపిన మదపుటేనుగు...
, శనివారం, 24 నవంబరు 2018 (13:36 IST)
అడవుల్లో ఉండాల్సిన గజరాజులు ఊళ్లలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. నానా బీభత్సం సృష్టించడమేకాకుండా, తనకు అడ్డొచ్చిన వారిని తొండంతో చుట్టి నేలకేసికొడుతుంది. కాళ్లతో తొక్కి చంపేసింది. అలాంటి సంఘటన ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హరిద్వార్‌లోని అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ మదపుటేనుగు గ్రామంలోకి దూసుకొచ్చింది. జనం మీద పడింది. తరిమి తరిమి కొట్టింది. దొరికిన ఓ వ్యక్తిని కాలుకింద నలిపేసి చంపేసింది. ఆ ఏనుగు బీభత్సం గురించి తెలిసి చుట్టుపక్కల గ్రామాల జనం గజగజా వణికిపోయారు. 
 
ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఆగమేఘాలపై గ్రామానికి వచ్చారు. మదపుటేనుగును అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో ప్రత్యేకంగా ఓ ఆపరేషన్ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఏనుగు వేట ప్రారంభించారు. మొత్తానికి దాన్ని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. 
 
ఏనుగుకు మత్తుమందు ఇవ్వడంతో మిన్నకుండిపోయింది. ఆ తర్వాత తాళ్లతో కట్టి.. తమ వాహనంలో మరో చోటకు తరలించారు. అక్కడ నుంచి ఏనుగుల శిబిరంలో దానిని వదిలేస్తామని… దాని ప్రవర్తనను గమనించి తర్వాత చర్యలు తీసుకుంటామని హరిద్వార్ ఫారెస్ట్ అధికారులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీవోకేలో చైనా బసు సర్వీసు... కరాచీలో డ్రాగన్ ఎంబసీపై ఉగ్రవాదుల దాడి