Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెంచకుండా పంచితే పంచె మిగులుతుంది: వెంకయ్య నాయుడు సెటైర్లు

తనపై విమర్శలు చేస్తున్న కమ్యూనిస్టు నేతలకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సెటైర్లు వేశారు. కమ్యూనిస్టుల వల్ల తయారీ, ఉత్పత్తి తగ్గి టెన్షన్ పెరిగిందన్నారు. అది పంచాలి, ఇది పంచాలి అంటూ వారు డిమాండ్ చేస్తు

Advertiesment
union minister venkaiah naidu
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (11:26 IST)
తనపై విమర్శలు చేస్తున్న కమ్యూనిస్టు నేతలకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సెటైర్లు వేశారు. కమ్యూనిస్టుల వల్ల తయారీ, ఉత్పత్తి తగ్గి టెన్షన్ పెరిగిందన్నారు. అది పంచాలి, ఇది పంచాలి అంటూ వారు డిమాండ్ చేస్తుంటారని, ఏదైనా పెంచకుండా పంచితే చివరకు మిగిలేదని పంచేనంటూ వ్యాఖ్యానించారు. 
 
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించడంపై కమ్యూనిస్టు నేతలు వెంకయ్యను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ... ప్రపంచమంతా మేడే రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటుందని, కానీ మన దేశంలో విశ్వకర్మ జయంతి రోజున కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారని గుర్తు చేశారు. 
 
ఇది మనకు సంప్రదాయంగా వచ్చిందన్నారు. కార్మికుడు, యజమాని రెండు చక్రాల్లాంటి వారని, వారు కలిసే ప్రయాణం సాగించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టులపై ఆయన మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడడం మంచిది కాదని సూచించారు. అసంఘటిత రంగ కార్మికులపై కేంద్రం దృష్టి సారించిందని పేర్కొన్న వెంకయ్య స్కిల్ ఇండియా పథకం ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తున్నట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య