Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాడేప‌ల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృత‌దేహాలు!

తాడేప‌ల్లిలో తాళం వేసిన ఇంట్లో... జంట మృత‌దేహాలు!
, గురువారం, 29 జులై 2021 (20:47 IST)
ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేప‌ల్లి ప్రాంతంలో ఒక‌ జంట మృత‌దేహాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి లో ఓ నివాసం లో గుర్తు తెలియని రెండు మృతదహాలు క‌నిపించాయి. ఈ జంట మృతి చెంది వారం రోజులు అయివుండొచ్చని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
చుట్టుప‌క్క‌ల వారికి దుర్వాస‌న రావటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంటి తాళాలు వేసి ఉండటంతో తాళాలు పగలకొట్టి ఆ ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించ‌గా, ఈ జంట మృత‌దేహాలు క‌నిపించాయి. 
 
వీరిద్ద‌రూ భార్య భ‌ర్త‌లు అయి ఉండ‌వొచ్చ‌ని, ఇంటికి తాళాలు వేసుకొని ఆత్మహత్యకి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివ‌రాల కోసం పోలీసుల దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేర‌ళలో క‌రోనా విజృంభ‌ణ‌... 2 రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌