Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్రం వీడి పారిపోయిన రవి ప్రకాష్.. సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్

రాష్ట్రం వీడి పారిపోయిన రవి ప్రకాష్.. సుప్రీంలో ముందస్తు బెయిల్ పిటిషన్
, మంగళవారం, 28 మే 2019 (16:31 IST)
ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రాష్ట్రంవీడి వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అదేసమయంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
టీవీ - 9 సంస్థ వాటాల కొనుగోలు విషయంలో ఫోర్జరీ, డేటా చౌర్యానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ నేర పోలీసు విభాగం నోటీసులు జారీచేసింది. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు జారీచేసినా ఆయన మాత్రం పోలీసుల ఎదుట రాలేదు. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైదారాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయంచాడు. ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురైతే నపంలో రవి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫలితాలు కారు స్పీడుకు బ్రేకులే .. నేను ఫెయిల్ కాలేదు: కేటీఆర్